AP Mega DSC: పరీక్షలు మొదలయ్యాయి ఆపలేం.. డీఎస్సీపై సుప్రీం
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:00 PM
AP Mega DSC: మెగా డీఎస్సీ కొనసాగింపుపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీం విముఖత చూపించింది.

అమరావతి, జూన్ 12: ఏపీలో మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్షల నిలిపివేతకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీం విముఖత చూపించింది. ఈ కేసులో ఏపీ హైకోర్ట్ను (AP High Court) ఆశ్రయించాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. జూన్ 16 నుంచి హైకోర్టు పునః ప్రారంభమైన తరువాత అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం తెలిపింది. మెగా డీఎస్సీ ఇప్పటికే ప్రారంభమైనందున వాటిని నిలిపివేయలేమని జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది.
పరీక్షలు ప్రారంభమైన తరువాత మధ్యలో ఎలా ఆపేస్తామని జస్టిస్ మన్మోహన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనల్లో.. మెగా డీఎస్సీ పరీక్షకు లక్షలాది మంది ఆశావాహులు ఇప్పటికే హాజరయ్యారని, పరీక్షలు జరుగుతున్నాయని, ఈ దశలో వీటిని నిలిపివేస్తే చాలా మందికి అన్యాయం చేసినట్లు అవుతుందని, వారి ప్రాథమిక హక్కులను హరించినట్లు అవుందని చెప్పారు. ఏపీ హైకోర్టును పిటిషనర్ ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ పీకే మిశ్రా ప్రశ్నించగా.. ఏపీ హైకోర్టుకు సెలవులు ఉన్నాయని అందుకే అదనపు పత్రాలతో సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. జూన్ 16న ఏపీ హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని అవసరమైతే అక్కడే పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీం స్పష్టం చేసింది.
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 బోధనా పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీని ఏర్పాటు చేశారు. దాదాపు 5.72 లక్షల మంది అభ్యర్థులు నెల రోజు పాటు ఈ పరీక్షలను రాయనున్నారని.. ఈ దశలో పరీక్షలను నిలిపివేయడం సాధ్యంకాదని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే ఈ ప్రక్రియ అంతా ఏకపక్షంగా జరుగుతోందని, పారదర్శకంగా లేదని.. అందుకే భారత రాజ్యంగం కింద ఆర్టికల్ 14, 15 ప్రకారం హక్కులను ఉల్లంఘింస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఏది ఏమైనా జూన్ 16న ప్రారంభంకానున్న ఏపీ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని.. ఇప్పుడు మెగా డీఎస్సీని నిలిపివేయడం సాధ్యం కాదంటూ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి
లోకేష్కు తల్లికి వందనం జీవోలు అందజేసిన సీఎం చంద్రబాబు
మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం
Read latest AP News And Telugu News