Lokesh: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో మంత్రి లోకేష్ భేటీ
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:27 PM
Lokesh Delhi visit: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. బుధవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో సమావేశం అయ్యారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి లోకేష్ తెలిపారు.

Delhi: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Loeksh) బిజీ బిజీగా గడుపుతున్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (Vice President Jagdeep Dhankhar)తో లోకేష్ భేటీ (Meets) అయ్యారు. సుమారు గంటసేపు ఉపరాష్ట్రపతితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం (Kutami Government) ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి మంత్రి లోకేష్ వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని జగదీప్ ధన్కడ్ను కోరారు.
ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు..
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి మంత్రి లోకేష్ తెలిపారు. దీనికి ధన్కడ్ స్పందిస్తూ.... అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అడిగి తెలుసుకున్నారు. రూ. 64 వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ సమాధానంగా చెప్పారు.
చరిత్ర సృష్టించబోతున్నాం..
ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతున్నామని లోకేష్ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకొని పోరాడానని ధన్కడ్ అన్నారు. 226 రోజుల పాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకు కడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి లోకేష్ అందించారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను వైస్ ప్రెసిడెంట్ ధన్కడ్ అభినందించారు. లోకేష్తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీటీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, బస్తిపాటి నాగరాజు, సానా సతీష్, శబరి తదితరులు ఉన్నారు.
కాగా ఈరోజు పలువురు కేంద్రమంత్రులతో లోకేష్ సమావేశంకానున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఇది చాలా కీలకమైన సమావేశం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో ఏపీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. దీనిపై ప్రధానంగా కేంద్రమంత్రితో చర్చంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్కు సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువగా చర్చించి అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం మరో ముగ్గురు కేంద్ర మంత్రులను కూడా మంత్రి లోకేష్ కలువనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఉప రాష్ట్రపతితో మంత్రి లోకేష్ భేటీ (ఫోటో గ్యాలరీ)
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత
For More AP News and Telugu News