Minister Lokesh: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు
ABN , Publish Date - May 11 , 2025 | 08:00 AM
తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం.. నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సయితం త్యాగం చేసిన మాతృమూర్తులందరికీ అభివందనం. మంత్రి నారా లోకేష్ ట్వీట్..

అమరవతి: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు. ఆమె ప్రేమకు మించిన ఆనందం ఉండదు. అందుకే ‘మాతృదేవోభవ...’ (Maatrudevo Bhava) అని ఆమెకే తొలి ప్రణామం చేస్తారెవరైనా. ఆదివారం ‘మదర్స్ డే’ (Mothers Day) సందర్భంగా... మంత్రి లోకేష్ (Minister Lokesh) సోషల్ మీడియా (Social Media) వేదికగా ట్విట్ (Tweet) చేశారు. ‘‘నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ. నడిపించిందీ, నడత నేర్పిందీ అమ్మే. ఓడినా, గెలిచినా వెంట నిలిచిందీ అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతీబిడ్డకు నిత్యస్ఫూర్తి మాతృమూర్తి. సహనం, త్యాగం, ప్రేమ మూర్తీభవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేస్తున్నాను’’ అంటూ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏమిచ్చి తీర్చుకోగలం..
తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం.. నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సైతం త్యాగం చేసిన మాతృమూర్తులందరికీ అభివందనం. ఈ రోజు మాతృ దినోత్సవం. అమ్మకు ప్రత్యేక అనుభూతిని పంచడంతో పాటు తన జీవితానికి ఆర్థిక భద్రత కల్పించే బహుమతి అందించేందుకు సరైన సందర్భమిది. అందుకు మీ ముందున్న అవకాశాలు..
Also Read: అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..
ఎఫ్డీ చేయండి..
మీకు వీలైనంత సొమ్మును మీ మాతృమూర్తి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేయండి. ఆ ఎఫ్డీ పత్రాన్ని ఈ ప్రత్యేక రోజున బహుమతిగా అందించండి. తద్వారా తనకు ఆర్థిక భరోసా కల్పించండి. ఒకవేళ మీ అమ్మ గారు 60 ఏళ్ల పైబడిన వారైతే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో సొమ్ము డిపాజిట్ చేయడం ఉత్తమం. సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే సీనియర్ సిటిజన్ పథకాలపై అధిక వడ్డీతో పాటు పన్ను రాయితీ లభిస్తుంది.
కాగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను మురళీ నాయక్ అంత్యక్రియల్లో మంత్రి పాల్గొననున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో అమరజవాను అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..
For More AP News and Telugu News