Share News

Kasireddy Supreme Court: కసిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ.. సుప్రీం తీర్పు త్వరలో

ABN , Publish Date - May 19 , 2025 | 12:25 PM

Kasireddy Supreme Court: ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో రాజ్‌కసిరెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీం అభిప్రాయపడింది.

Kasireddy Supreme Court: కసిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ.. సుప్రీం తీర్పు త్వరలో
Kasireddy Supreme Court

న్యూఢిల్లీ, మే 19: ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam Case) తన అరెస్ట్ చట్ట వ్యతిరేకమంటూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasir Reddy Rajasekhar Reddy) దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ పూర్తి అయ్యింది. తీర్పును జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం రిజర్వ్ చేసింది. హైదరాబాద్‌లో (Hyderabad) నోటీసు ఇచ్చినప్పుడు చెప్పిన కారణాలు వేరని, కస్టడీ రిపోర్టులో వేరే కారణాలను వెల్లడించారని కసిరెడ్డి తరపు న్యాయవాది వాదించారు. విజయవాడకు తీసుకొచ్చిన తరువాత అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారని తెలిపారు.


అరెస్ట్ సమయంలో కానీ, కస్టడీ సమయంలో కానీ పీసీ యాక్ట్‌పై కసిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, సుప్రీం పిటీషన్‌లో మాత్రం కొత్త అభ్యంతరాలను లేవనెత్తుతున్నారని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఆంధ్రాకు చెందిన సీఐడీ వేరే రాష్ట్రంలో నోటీసులు ఇవ్వడం కూడా చెల్లవంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇరు తరపు వాదనలను లిఖిత పూర్వకంగా సాయంత్రంలోగా ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. విచారణ ముగియడంతో తీర్పును తరువాత వెల్లడిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే బెయిల్ కోసం ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించాలంటూ ఉన్నతన్యాయస్థానం అభిప్రాయపడింది.


ఏపీ మద్యం కేసులో తన అరెస్ట్ చట్ట వ్యతిరేకమని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తన కొడుకు అరెస్ట్‌లో నిబంధనలు పాటించలేదని.. అంతేకాకుండా తనకు ఇచ్చిన నోటీసులు చెల్లవంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు (సోమవారం) సుప్రీంలో విచారణ ముగిసింది. జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ఈ కేసు విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. కసిరెడ్డి, ఉపేందర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలానీ వాదించారు. ఆంధ్రాకు చెందిన సీఐడీ వేరే రాష్ట్రంలో నోటీసులు ఇవ్వడం చెల్లదన్న వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వాదించారు. అయితే కసిరెడ్డి, ఆయన తండ్రి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌‌లను గతంలో హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇద్దరు కూడా సుప్రీంలో సవాల్ చేశారు. వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం ఇరువురి వాదనలను లిఖిత పూర్వకంగా ఈరోజు (సోమవారం) సాయంత్రానికి ఇవ్వాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2025 | 12:40 PM