Share News

AP News: మరోసారి విషం చిమ్మిన జర్నలిస్టు కృష్ణంరాజు

ABN , Publish Date - Jun 10 , 2025 | 08:11 AM

Krishnamraju: సాక్షి జర్నలిస్టు కృష్ణంరాజు మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ ఓ వీడియో విడుదల చేశాడు. గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించాడు.

AP News: మరోసారి విషం చిమ్మిన జర్నలిస్టు కృష్ణంరాజు
Journalist Krishnamraju

Amaravati: ఏపీ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) ప్రాంతంపై జర్నలిస్టు కృష్ణంరాజు (Journalist Krishnamraju) మరోసారి విషం చిమ్మాడు. తన వ్యాఖ్యలకు ఆధారాలు (controversial statements) ఉన్నాయంటూ వీడియో (Video) విడుదల చేశాడు. గతంలో వ్యభిచార గృహాలపై పోలీసు దాడులకు సంబంధించిన క్లిప్పింగులు ప్రదర్శించాడు. తన వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం పశ్చాత్తాపం ప్రదర్శించకపోగా.. కృష్ణంరాజు మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఇంత జరిగినా ఇంకా బరితెగించి మాట్లాడుతున్నాడు.


తాను చేసిన వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలంటూ.. గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించిన కృష్ణంరాజు. ఈ క్లిప్పింగులతో ఓ వీడియోను ఏపీటీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశాడు. ప్రజలను మరింత రెచ్చగొట్టడమే దీని వెనక లక్ష్యంగా కృష్ణంరాజు వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యభిచారగృహాలపై పోలీసుల దాడులు దేశవ్యాప్తంగా ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. కొన్నేళ్ల వార్తలు పరిశీలిస్తే ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇలాంటివి కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. కానీ కృష్ణంరాజు మాత్రం ఇలాంటివన్నీ ఒక్క అమరావతి ప్రాంతంలోనే జరుగుతున్నాయంటూ వక్ర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


కాగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు మూడు రోజుల కిందటే విజయవాడలోని తన ఇంటికి తాళం వేసి కుటుంబంతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు జగన్ మీడియా తీరుపై ఏపీ వ్యాప్తంగా మహిళల నిరసనలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి.


మరోవైపు రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టులు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు రమణమ్మ సోమవారం తీవ్రంగా ఖండించారు. అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎర్రగొండపాలెం అంబేద్కర్‌ సెంటరులో సాక్షి ప్రతులను మహిళ నాయకులు దహనం చేశారు. జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేయడమే కాకుండా చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్‌ చేశారు. కాగా తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు ఆధ్వర్యంలో సాక్షి ప్రాంతీయ కార్యాలయం వద్ద, తరువాత పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలియజేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి పట్టణ సీఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, నేతలు శంకర్ల పద్మలత, పెదపాటి కల్యాణి, బత్తుల లక్ష్మి, కె.ఈశ్వరమ్మ, కె.సత్యవతి, ఎస్‌.అమరావతి, పి.తులసి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు..

సంకెళ్లు వేసి.. నేలకు అదిమి..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 10 , 2025 | 08:11 AM