Share News

PSR Remand: పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

ABN , Publish Date - Jun 05 , 2025 | 02:17 PM

PSR Remand: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పీఎస్సార్‌ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

PSR Remand:  పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే
PSR Remand

విజయవాడ, జూన్ 5: ఏపీపీఎస్సీలో అవకతవకల కేసులో ఏ1గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు (Senior IPS officer PSR Anjaneyulu) రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో (Vijayawada Central Jail) రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు పీఎస్సార్. నేటితో (గురువారం) రిమాండ్ ముగియడంతో కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపర్చారు. ఈ క్రమంలో ఈనెల 19 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు తిరిగి పీఎస్సార్‌ను జిల్లా జైలుకు తరలించారు.


ప్రధానంగా ఏపీపీఎస్సీలో అవకతవకలకు సంబంధించి మొత్తం వ్యవహారం పీఎస్సార్‌ చుట్టూనే తిరిగినట్లు విచారణలో పోలీసులు నిర్ధారించారు. గత వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గ్రూప్ 1వ మూల్యాంకణానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు వ్యక్తుల చేత మూల్యాంకణం చేయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ1గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ2గా ధాత్రి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎస్సార్‌ చెబితేనే ఈ మొత్తం వ్యవహారం నడిపించానని ధాత్రి మధు తన స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చారు.


ఈ కేసును తవ్వే కొద్దీ మరిన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పీఎస్సార్‌, ధాత్రి మధులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ కేసుకు సంబంధించి మధు నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే పీఎస్సార్ ఐపీఎస్ అధికారిగా చట్టపరమైన నిబంధనలు తెలిసినప్పటికీ విచారణలో పూర్తిగా సహకరించక పోగా.. పోలీసులనే ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పీఎస్సార్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


అయితే జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీకి ఉన్న పీఎస్సార్ రెండు సార్లు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బీపీలో హెచ్చుతగ్గులు రావడం, గుండెకు సంబంధించి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయనకు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందజేశారు. రిమాండ్ ముగియడంతో ఈరోజు జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించిగా.. రిమాండ్‌‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 19 వరకు పీఎస్సార్‌ రిమాండ్ కొనసాగనుంది.


ఇవి కూడా చదవండి

మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 02:46 PM