Share News

Minister Satyakumar: ఏపీ మంత్రికి నకిలీ ఎఫ్‌బీ అకౌంట్ బెడద

ABN , Publish Date - May 17 , 2025 | 03:58 PM

Minister Satyakumar: ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ కలకలం రేపుతోంది. దీనిపై మంత్రి పేషీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Minister Satyakumar: ఏపీ మంత్రికి నకిలీ ఎఫ్‌బీ అకౌంట్ బెడద
minister satyakumar

అమరావతి, మే 17: ఏపీ వైద్యరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత సత్య కుమార్‌ను (AP Minister Satyakumar) నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్ (Face Book Account) బెడద వేధిస్తోంది. సత్యకాలం పేరుతో ఎఫ్‌బీ అకౌంట్‌లో అసభ్య పోస్టింగ్‌లు ఉండటంతో మంత్రి కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారించగా ప్రస్తుతం ఆ అకౌంట్ ఇన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు.


మంత్రి సత్యకుమార్ పేరుతో కొంత మంది ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేశారు. ఈ అకౌంట్‌లో గత కొంత కాలంగా బీజేపీకి సంబంధించిన, మంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టింగ్‌లు పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం అసభ్యకరమైన ఓ ఫోటోను ఆ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని గుర్తించిన మంత్రి కార్యాలయం వెంటనే అలెర్ట్ అయ్యింది. ఈ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అకౌంట్‌ను అప్పర్ తిరుపతి నుంచి రన్‌ చేస్తున్నట్లు అకౌంట్లో పేర్కొన్నారు. ఒక ఫోన్‌ నెంబర్‌ను కూడా అకౌంట్‌లో ఇవ్వడం జరిగింది. అకౌంట్ విషయంపై మంత్రి కార్యాలయానికి సమాచారం వెళ్లగా.. వెంటనే రీచెక్‌ చేసుకున్న సిబ్బంది.. అకౌంట్‌పై అప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Remand Report: ధనుంజయ్, కృష్ణ మోహన్ రిమాండ్‌లో రిపోర్టులో కీలక విషయాలు


మంత్రులకు ఉన్న మంచి పేరును డీమోర్‌లైక్ చేయడానికి కొంత మంది ఇలా ఫేస్‌బుక్‌ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్లను నకిలీవి సృష్టించి వారికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ నకిలీ అకౌంట్ ప్రస్తుతం ఇన్‌యాక్టివేట్‌లో ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలా నకిలీ అకౌంట్ సృష్టించి సమాజంలో గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వారిని ఇబ్బందులు పెట్టకుండా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పేషీ అధికారులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

CM Chandrababu Congrats Neeraj: నీ విజయం దేశానికే గర్వకారణం.. నీరజ్‌‌పై సీఎం ప్రశంసల జల్లు

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

Read Latest AP News And Telugu News

Updated Date - May 17 , 2025 | 04:07 PM