Share News

Amaravati:మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..

ABN , Publish Date - May 04 , 2025 | 07:18 AM

మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని, ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Amaravati:మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) నిర్మాణంపై మంత్రి నారాయణకు (Minister Narayana ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) టార్గెట్ (Target) పెట్టారు. రాజధానిలో మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కూటమి ప్రజాప్రతినిధులతో శనివారం సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.


పునఃప్రారంభ సభ విజయవంతం..

అమరావతి ఆవశ్యకతను దేశప్రజలందరికీ వివరించేందుకు అమరావతి పనుల పునఃప్రారంభాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిపించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం కూట మి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతి పునఃప్రారంభ సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేశారని అభినందించారు.

Also Read: సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం


ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి...

‘‘అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి. రాష్ట్ర వృద్ధిరేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్‌ రాజధానిని ఆవిష్కరించాయి. అమరావతికి ప్రధాని భరోసా ఇచ్చారు. దేశానికి అమరావతి రోల్‌మోడల్‌గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వకారణం. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.’’ అని చంద్రబాబు తెలిపారు. కాగా, అమరావతి పునఃప్రారంభ సభపై అన్నివర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు పార్థసారథి, సత్యకుమార్‌, నాదెండ్ల మనోహర్‌ అభిప్రాయపడ్డారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రి నారాయణపై ఉందని వ్యాఖ్యానించారు.

ప్రజల భాగస్వామ్యంతోొనే సభ విజయవంతం..

ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ విజయవంతం అయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందన్నారు. సమన్వయంతో పని చేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు తెలిపారు.అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారన్నారు. ప్రధాని ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని, లక్షల మంది ప్రజలు పోటెత్తినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పధంతో కార్యక్రమం జరిగిందన్నారు.రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు అభిప్రాయ పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరులో ఫుల్‌టైం.. తాడేపల్లిలో పార్ట్‌టైం..

నవ వధువు ఆత్మహత్య..

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 07:18 AM