Share News

AP Ministers Slam Jagan: జగన్‌ ఖబడ్దార్.. మంత్రుల హెచ్చరిక

ABN , Publish Date - Jun 03 , 2025 | 03:23 PM

AP Ministers Slam Jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రులు ఫైర్ అయ్యారు. తల్లికి, చెల్లికి వెన్ను పోటు పొడిచింది జగన్‌ కాదా అని మంత్రి సవిత ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవుపలికారు.

AP Ministers Slam Jagan: జగన్‌ ఖబడ్దార్.. మంత్రుల హెచ్చరిక
AP Ministers Slam Jagan

అమరావతి, జూన్ 3: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (CM Chandrababu Naidu) ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్ (Former CM Jagan) చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదంటూ ఫైర్ అయ్యారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. జగన్ ఒక రంగుల రెడ్డి అని.. ఆయనవి చీప్ పాలిటిక్స్ అంటూ విరుచుకుపడ్డారు. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని.. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు. జగన్ రౌడీ షీటర్‌లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే అని అన్నారు. ‘జగన్ ఖబడ్దార్.. మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు’ అని హెచ్చరించారు.


అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్‌ కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవుపలికారు. వైఎస్ వివేకాను చంపితే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయలేదని నిలదీశారు. ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రైతులను జగన్ ఎలా మోసం చేశారో తెలుసన్నారు. పింఛన్‌ను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఒకేసారి పెంచామని.. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింన్‌ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఉందో చూపించు అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.


‘జగన్ నీ భూ చట్టాలను రద్దు చేశాం. నీ హయంలో ఎన్ని లక్షల ఎకరాలు అక్రమాలు చేశారో.. ఇప్పుడు బయటికి వస్తున్నాయి’ అని తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ధ్వంసం చేశారని మండిపడ్డారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఎంత మందికి ఇచ్చావు జగన్ అంటూ ప్రశ్నించారు. తాము తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉన్నా రూ.15 వేలు ఇస్తున్నామని తెలిపారు. ల్యాండ్, వైన్, మైన్‌లో అక్రమాలు చేశారంటూ మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


జగన్ సిగ్గుపడాలి: మంత్రి అనగాని

anagani-satyaprasad-ministe.jpg

గంజాయి అమ్మే రౌడీ మూకలను పరామర్శించేందుకు తెనాలి వెళ్లిన జగన్ సిగ్గుపడాలి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది కేసులు ఎదుర్కొంటున్న జాన్ విక్టర్ అమాయకుడైన అడ్వకేట్ అంటూ చెప్పడం జగన్‌కే చెల్లిందన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ రౌడీ మూకలతో దాడులు చేయించడమే రాజకీయంగా నడిపిన వ్యక్తి జగన్ అంటూ విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ రౌడీ రాజకీయానికి చెంప చెళ్లుమనిపించినా.. క్రిమినల్ బుద్ధి అయితే ఇంకా మారలేదన్నారు. డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబాన్ని కనీసం పరామర్శించని జగన్.. గంజాయి ముఠా వద్దకు మాత్రం పరిగెత్తుకొని వెళ్లారంటూ ఫైర్ అయ్యారు. జగన్‌కు తెలిసిందల్లా అరాచకం, బెదిరింపులు, అవినీతి, విధ్వంసం మాత్రమే అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.


జగన్ ఓ సైకో: ధూళిపాళ్ల

Dhulipalla-Narendra.jpg

అమరావతి: జగన్ మరోసారి సైకోలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (MLA Dhulipalla Narendra) ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో పోలీసు వాహనం మీద ఎక్కి వికృత చేష్టలకు పాల్పడిన సైకో అని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పైశాచిక సైకోలకు మద్దతు పలకడానికి వెళ్లేందుకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. ప్రజలు దిక్కరించినా జగన్ వైఖరిలో మార్పు లేదన్నారు. జగన్ లాంటి వ్యక్తులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు, ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు లేదన్నారు. జగన్ 2.0 చూపిస్తానంటూ సైకోలను ఉసిగొల్పి అరాచకాలను మళ్ళీ మొదలెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పోలీసుల వాహనం మీద హాల్‌చల్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

జగన్‌పై ఓ రేంజ్‌లో పైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు

తుని కేసుపై సర్కార్ క్లారిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 03:38 PM