Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
ABN , Publish Date - May 20 , 2025 | 12:11 PM
Liquor Case Remand: ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

విజయవాడ, మే 20: ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam Case) ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. ఈకేసులో నిందితులకు నేటితో (మంగళవారం) రిమాండ్ ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య,పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపర్చారు. వీరికి ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది. ఇక కేసులో దర్యాప్తు పురోగతి తెలియజేయటం లేదని నిందితుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
దీనిపై స్పందించిన కోర్టు.. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగింపుతో పాటు దర్యాప్తు పురోగతిని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ సమయంలో తమ కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నిందితులు కోరగా.. మానవతా దృక్పథంతో అరగంట పాటు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు న్యాయాధికారి వెసులుబాటు కల్పించారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. దీనిపై రేపు (బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది.
NIA Investigation: ఉగ్ర కుట్రపై రెండో రోజు ఎన్ఐఏ దర్యాప్తు
మద్యం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయధికారికి పది పేజల లేఖ అందజేశారు. గతంలోనే తనకు కొన్ని విషయాలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రిమాండ్ పొడిగింపు సమయంలో రాత పూర్వకంగా ఇవ్వాలని న్యాయాధికారి సూచించారు. దీంతో న్యాయధికారికి సజ్జల లేఖ రాశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఇతర అంశాలని ప్రస్తావిస్తూ పది పేజీల లేఖను కోర్టుకు సజ్జల శ్రీధర్ రెడ్డి అందజేశారు.
ఇవి కూడా చదవండి
JN.1 COVID 19 Variant: కొవిడ్ కేసుల పెరుగుదల.. ఏమిటీ జేఎన్.1 కరోనా వేరియంట్
US: అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News