ABV ACB Case: ఏపీ హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట
ABN , Publish Date - May 07 , 2025 | 12:05 PM
ABV ACB Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

అమరావతి, మే 7: విశ్రాంత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు (Retired senior IPS officer AB Venkateswara Rao) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను కూడా న్యాయస్థానం నిలిపివేసింది. గతంలో ఈ కేసుపైనే ఏబీ వెంకటేశ్వర రావును గత ప్రభుత్వం సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే.
ఏబీ వెంకటేశ్వరరావును గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిఘా విభాగం డైరెక్టర్ జనరల్గా ఉన్న ఏబీపై గత ప్రభుత్వ అనేక అభియోగాలు మోపింది. ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనను సస్పెండ్ చేసింది. భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2021లో ఏబీవీపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. అయితే తనపై సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఏబీ కోర్టును ఆశ్రయించగా.. సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్గా నియమించింది గత వైసీపీ సర్కార్.
Indian Army: చెప్పిందే.. చేసింది.. ఆర్మీ వీడియో వైరల్
ఆ తరువాత 2022లో మరోసారి సస్పెండ్ చేయగా.. దీనిపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఏబీపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని నిర్ణయించారు. దాదాపు రెండు సార్లు గత ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఒకసారి.. 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు రెండోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది గత సర్కార్. చివరకు ఆయన రిటైర్మెంట్కు ఒకరోజు ముందు వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వగా.. కొన్ని గంటల్లోనే ఆయన రిటైర్ అయ్యారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీవీపై గత ప్రభుత్వం హయాంలో నమోదైనా అభియోగాల్లో నిజం లేదని విచారణలో తేల్చింది. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఆదేశించింది. అంతేకాకుండా సస్పెన్షన్ సమయంలో విధులు నిర్వహించినట్లుగా గుర్తించి వేతన, అలవెన్సుల చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాగే ఏబీపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: అందుకే.. ఆపరేషన్ సింధూర్.. త్రివిధ దళాల రియాక్షన్ ఇదే..
Operation Sindoor: ఎయిర్లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్
Read Latest AP News And Telugu News