Tuni Case AP Govt: తుని కేసుపై సర్కార్ క్లారిటీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 02:15 PM
Tuni Case AP Govt: తుని కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ కేసును తిరగదోడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

అమరావతి, జూన్ 3: తుని కేసుకు (Tuni Case) సంబంధించి ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని సర్కార్ స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై సర్కార్ ఆరా తీసింది. కేసుపై ఆర్పీజీ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు గుర్తించింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం నుంచి అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. జీవోను రద్దు చేస్తూ కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
తుని కేసును కింది కోర్టు కొట్టివేయడంతో హైకోర్టుకు వెళ్లాలంటూ నిన్న (సోమవారం) ఇచ్చిన ఉత్తర్వులపై నేడు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలన చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. తుని కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంతో జరిగే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదు అని అధికారులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
లిక్కర్ స్కాం నిందితులకు మరోసారి బిగ్ షాక్
Read Latest AP News And Telugu News