Amaravati Women: భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:43 PM
Amaravati Women: సాక్షి ఛానల్లో అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ రాజధాని మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన సతీమణికి మహిళలు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అమరావతి, జూన్ 7: తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి ఛానల్లో వైసీపీ నేతలు (YSRCP Leaders) పని గట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష ప్రచారంపై కార్యాచరణ కోసం ఈరోజు (శనివారం) రైతులు, మహిళలు సమావేశమయ్యారు. అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు నోరుపారేసుకున్నారు. ఇటువంటి చర్చ పెట్టినందుకు కొమ్మినేని శ్రీనివాసరావుపై.. అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసినందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆపై పోలీస్టేషన్లో కృష్ణంరాజు, సాక్షిపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంత మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రాజధాని మహిళలు మాట్లాడుతూ.. అమరావతి రైతులు, మహిళలపై విషం చిమ్ముతారా అంటూ ఫైర్ అయ్యారు. సెక్స్ వర్కర్లు, వేశ్యలు అని నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ‘మీరంతా వచ్చి ఇక్కడ నీచమైన పనులు చేసి వెళ్లారా. మీ ఇళ్లల్లో ఆడవాళ్లు లేరా.. మిమ్మలను చెప్పుతో కొట్టాలి. మమ్మల్ని వేశ్యలు అంటారా, ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయని అంటారా. గత ఐదేళ్లల్లో జగన్ చేసిన పాపాలకు 270 మంది రైతులు చనిపోయారు. ఆడవాళ్లను గౌరవించలేని వాడు అసలు మగాడే కాదు. భారతీ రెడ్డి ... మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. నిన్ను తిట్టినప్పుడు మేమంతా తప్పు అని చెప్పాం. ఇప్పుడు మీ సాక్షిలో మమ్మల్ని తిట్టిస్తావా. ఈ కార్యక్రమంపై భారతీ రెడ్డి మాకు క్షమాపణ చెప్పాలి. మాధ్యమాల్లో నుంచి ఆ వీడియోను తొలగించాలి. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తాం. కృష్ణం రాజు అనే వాడిని అరెస్టు చేయాలి. లేదంటే వాడి ఇంటికి వెళ్లి చెప్పులతో కొడతాం. అమరావతి దేవతల రాజధాని కాదా. అసలు కృష్ణం రాజు అనే వాడు జర్నలిస్టా. నీ ఇంట్లో ఆడవాళ్లే నిన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు. సాక్షి డిబేట్లో ఇంత దారుణ వ్యాఖ్యలు చేస్తే భారతీ రెడ్డి స్పందించరా. నీవు మహిళగా ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలి. నీ భర్తకు ఎలాగు సిగ్గు లేదు... నువ్వు అయినా మహిళగా స్పందించు. పోలీసులు కృష్ణంరాజుపై, కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మళ్ళీ అమరావతి నుంచి మరో ఉద్యమం మొదలవుతుంది. జగన్ నీచ రాజకీయాలు మానుకో... లేదంటే నువ్వు, నీ భార్య రోడ్ల మీద తిరగలేరు’ అంటూ రాజధాని మహిళలు వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి
ఏఐజీ హాస్పటల్లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
Read Latest Telangana News And Telugu News