Share News

Supreme Court: బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారు..

ABN , Publish Date - May 23 , 2025 | 12:33 PM

Supreme Court: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని ధర్మాసనం పేర్కొంది.

Supreme Court: బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారు..
Supreme Court

న్యూఢిల్లీ: సజ్జల భార్గవరెడ్డి (Sajjala Bhargava Reddy)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఎస్సీ (SC), ఎస్టీ అట్రాసిటీ కేసు (ST atrocity case)లో ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నజస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌తో ధర్మాసనం సూచించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని ధర్మాసనం పేర్కొంది. ఎవరు తప్పు చేసినా వ్యవస్థ చర్యలు తీసుకోవడం తథ్యమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.


కాగా సజ్జల భార్గవ్ పిటిషన్‌పై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌తో కూడిన ధర్మాసనం గత గురువారం (ఈ నెల 15వ తేదీ) విచారణ చేపట్టింది. అయితే సీనియర్ న్యాయవాదులు ఎవరు అందుబాటులో లేని కారణంగా ఈ కేసు వాయిదా వేయాలని సుప్రీం ధర్మాసనాన్ని సజ్జల భార్గవ్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి ట్రయల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని సూచించింది. ఇక్కడ విచారణ కుదరదని తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది వాదనల కోసం ఈ కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Also Read: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ.. బిజీ..


సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణ చేపట్టాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టమని ఏపీ హైకోర్టు తెలిపింది. ఆ క్రమంలో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీనిని సవాల్ చేస్తూ సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు కింద కోర్టుకు వెళ్లాలని సూచించింది. అంతేకానీ.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా..

For More AP News and Telugu News

Updated Date - May 23 , 2025 | 12:33 PM