Mahanadu: పులివెందులలో వైసీపీ శ్రేణులపై కేసు..
ABN , Publish Date - May 30 , 2025 | 02:06 PM
Mahanadu: పులివెందుల (Pulivendula)లో మహానాడు (Pulivendula) టీడీపీ తోరణాలను (TDP Banners) తొలగించిన వైసీపీ శ్రేణుల (YCP Activists)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి (PA Raghav Reddy), మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్ (Varaprasad)లతోపాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 191,2. 191,3. 324,4.109 రెడ్ విత్ 190 బీఎంఎస్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు.

Mahanadu: పులివెందుల (Pulivendula)లో మహానాడు (Pulivendula) టీడీపీ తోరణాలను (TDP Banners) తొలగించిన వైసీపీ శ్రేణుల (YCP Activists)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి (PA Raghav Reddy), మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్ (Varaprasad)లతోపాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 191,2. 191,3.324,4.109 రెడ్ విత్ 190 బీఎంఎస్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు.
బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్బంగా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి శుక్రవారం పులివెందులలో మీడియాతో మాట్లాడారు. పులివెందుల రింగురోడ్డు చుట్టూ వైఎస్ఆర్ విగ్రహాలు అమర్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మహానాడు సందర్భంగా తాము ఎక్కడ కూడా వైఎస్ఆర్ విగ్రహాలకు తగిలే విధంగా తోరణాలు కట్టలేదని స్పష్టం చేశారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: మత్తుమందు ఇచ్చి దారుణం.. ఆపై బ్లాక్ మెయిల్
నిజమైన వైఎస్సార్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి
నిజమైన వైఎస్సార్ భిమానులు ఒక్కసారి ఆలోచించాలని, వైఎస్ విజయలక్ష్మిపై కేసు నమోదు చేయించిన వారెవరో ఆలోచించాలని బీటెక్ రవి అన్నారు. న్యాయబద్ధంగా షర్మిల రెడ్డికి రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి రాముడైతే.. లక్ష్మణుడులా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి అని, అలాంటి వివేకను హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరు ఎదుర్కొంటున్నారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీటెక్ రవి విమర్శించారు.
పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్..
పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరిపైన అయినా కక్ష సాధింపు చర్యలు తాము చేశామని నిరూపించగలరా అని సవాల్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులేని ఆరోపించారు. గతంలో కడప నుంచి వస్తున్న తనను అరెస్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిన వారు మీరు కాదా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి తల్లిని సయితం అడ్డుపెట్టుకొని సీబీఐకు దొరకకుండా తప్పించుకున్నారు కదా అని బీటెక్ రవి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
14 ఏళ్ల తర్వాత సినీ అవార్డుల సంబరం
For More AP News and Telugu News