గ్రీస్లో ఐటీ ఉద్యోగావకాశాలు: నైపుణ్యాభివృద్ధి సంస్థ
ABN , Publish Date - May 26 , 2025 | 04:32 AM
గ్రీస్లో డాట్ నెట్, ఎంఎస్ ఎస్ క్యుఎల్ డెవలపర్లకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించబడుతున్నాయి. ఎంపికైనవారికి రూ.25.2 లక్షల వేతనం, ఉచిత నివాసం, భద్రతా ప్రయోజనాలు ఉంటాయి.

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యువతకు ఇతర దేశాల్లో ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ మనోహర్ తెలిపారు. ఇందులో భాగంగా అనుభవం ఉన్న డాట్ నెట్, ఎంఎస్ ఎస్క్యూఎల్ డెవలపర్లను గ్రీస్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపికైన వారికి రూ.25.2 లక్షల వార్షిక వేతనం లభిస్తుందన్నారు. అలాగే ఉచిత నివాసం, పబ్లిక్ ఇన్సూరెన్స్, సామాజిక భద్రత, కాంట్రాక్టు రెన్యువల్ ప్రయోజనాలు ఉంటాయన్నారు. డాట్ నెట్, ఎంఎస్ ఎస్క్యూఎల్లో కనీసం ఐదేళ్ల అనుభవం, మెరుగైన ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. మరింత సమాచారం కోసం 9988853335ను సంప్రదించాలన్నారు.