Rajani Passport Case: పాస్పోర్ట్ రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇవ్వండి
ABN , Publish Date - May 07 , 2025 | 04:49 AM
వైసీపీ నేత విడదల రజని పాస్పోర్టు రెన్యువల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని పూర్తి వివరాలు సమర్పించాలనీ హైకోర్టు ఆదేశించింది

హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత విడదల రజని
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): తన పాస్పోర్టు రెన్యువల్ చేసేలా విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత విడదల రజని దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.