Sajjala Bhargav Police Inquiry: ముందే వచ్చేసిన సజ్జల భార్గవ్ రెడ్డి
ABN , Publish Date - May 28 , 2025 | 12:40 PM
Sajjala Bhargav Police Inquiry: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్స్టేషన్కు ముందే వచ్చారు వైసీపీ నేత.

గుంటూరు, మే 28: వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy) అనుకున్న సమయానికంటే ముందుగానే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈరోజు (బుధవారం) మంగళగిరి పోలీస్స్టేషన్లో (Mangalagiri Police Station) సజ్జల విచారణకు వచ్చారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భార్గవ్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్తో (Minister Nara Lokesh) పాటు జనసేన, టీడీపీ ముఖ్య నేతలపై కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
ఈ కేసు నమోదు మేరకు సజ్జలకు మంగళగిరి రూరల్ పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు రాకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు సజ్జల. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా సుప్రీంలో పిటిషన్ వేశారు. అయితే సజ్జల వేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. దీంతో పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా మంగళగిరి రూరల్ పోలీసులు సజ్జల భార్గవ్కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సజ్జల ముందుగానే మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్కు వచ్చారు. మంగళగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరగాల్సి ఉంది.
అయితే పోలీసులు ఇచ్చిన సమయం కంటే ముందుగానే సజ్జల విచారణకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడే విచారణ చేస్తారా లేక పోలీసులు నోటీసులు ఇచ్చిన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయనను ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. లేకపోతే మధ్యాహ్నం 3 గంటలకే సజ్జలను రమ్మని చెబుతారా అనేది తెలియాల్సి ఉంది. మంగళగిరి పోలీస్స్టేషన్కు సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చేరుకున్నారు. డీఎస్పీ వచ్చిన తర్వాత సజ్జలను విచారిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి
ఎన్టీఆర్కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
Read Latest AP News And Telugu News