Share News

Raghurama: రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు.. జగన్‌పై రఘురామ ఫైర్

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:23 PM

వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తరిమికొడతారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేవతల రాజధాని అన్నారని.. ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రఘురామ మండిపడ్డారు.

Raghurama: రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు.. జగన్‌పై రఘురామ ఫైర్
Raghurama krishnam Raju

కృష్ణా: ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) బురదజల్లుతున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghurama krishnam Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ముందు నుంచే విషప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గతంలో మాట్లాడిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు రఘురామకృష్ణంరాజు.


వైసీపీ నేతలు వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తరిమికొడతారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి రఘురామకృష్ణంరాజు వచ్చారు. ఈ సమయంలో రఘురామకి అమరావతి మహిళలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో రఘురామ మాట్లాడారు. గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు పనిచేశారని తెలిపారు రఘురామకృష్ణంరాజు.


జర్నలిస్టులకు విధివిధానాలు నేర్పాల్సిన వ్యక్తి ఇలా జర్నలిజం విలువలు మర్చిపోయి మాట్లాడుతారా అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటే కొమ్మినేని వెక్కిలి నవ్వులు నవ్వుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణంరాజు వ్యాఖ్యలకు అలా సపోర్ట్ చేయడమనేది తీవ్రమైన చర్య అని దుయ్యబట్టారు. రెండు రోజుల నుంచి చూస్తున్నామని.. మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి లేఖ రాశామని గుర్తుచేశారు. ఈ విషయంపై డీజీపీకి తగిన చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు రఘురామకృష్ణంరాజు.


తనకైతే విశ్వాసం ఉందని.. రాబోయే 24 గంటల్లో వాళ్లని అరెస్ట్ చేస్తారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నారని అన్నారు. మహిళల గురించి అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేవతల రాజధాని అన్నారని.. ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అమరావతిపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సాక్షిలో పనిచేస్తున్న కొమ్మినేనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రఘురామకృష్ణంరాజు వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..

హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన

For More AP News and Telugu News

Updated Date - Jun 09 , 2025 | 12:33 PM