Share News

Journalist Krishnam Raju: జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

ABN , Publish Date - Jun 11 , 2025 | 09:44 PM

రాజధాని మహిళలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో అతడిని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Journalist Krishnam Raju: జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
Journalist Krishnam Raju

గుంటూరు, జూన్ 11: రాజధాని మహిళలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అతడిని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని తుళ్లూరు పోలీసులు మంగళగిరి తీసుకు వస్తున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.


వైసీపీకి చెందిన సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించి చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తం ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుతోపాటు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజలు ఆందోళనలు చేపట్టారు.


ఇక రాజధాని ప్రాంత ప్రజలు అయితే.. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఈ వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఫిర్యాదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి


రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు

పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్

For More AP News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 10:07 PM