Share News

Vamsi Health Update: మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

ABN , Publish Date - May 26 , 2025 | 10:53 AM

Vamsi Health Update: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో వెంటనే వంశీని పోలీసులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.

Vamsi Health Update: మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ
Vamsi Health Update

గుంటూరు, మే 26: పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోర్టుకు వచ్చిన సమయాల్లో కూడా వంశీ ఎంతో నీరసంగా కనిపించారు కూడా. చాలా రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో మాజీ ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తరువాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి అనారోగ్య సమస్యతో వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు పోలీసులు.


శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని ఈరోజు (సోమవారం) పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కంపిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కాగా.. జైలులో శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయధాకారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి వంశీని అనారోగ్యం కారణంగా జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పోలీసుల ఓవరాక్షన్

మరోవైపు గుంటూరు జీజీహెచ్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనారోగ్య సమస్యతో బాధపుడుతున్న వంశీని విజయవాడ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఇక్కడే పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వంశీని ఆస్పత్రి లోపలికి తరలించిన తర్వాత జీజీహెచ్ ప్రధాన గేటును పోలీసులు మూసి వేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసుల తీరుతో మిగిలిన రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలా ఆస్పత్రి ప్రధాన గేటును మూసివేస్తే ఎలా అంటూ రోగుల బంధువులు మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

పార్టీ మహిళా కార్యకర్తతో బీజేపీ సీనియర్ నేత అసభ్య ప్రవర్తన

అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 11:04 AM