YS Jagan Tenali Tour: వైఎస్ జగన్ పరామర్శలో ట్విస్ట్
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:58 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుంది. ఇప్పటికే ఆయన చేస్తున్న ఈ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న వేళ.. పోలీసులు ఆరా తీస్తున్నారు.

అమరావతి, జూన్ 03: తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రౌడీ షీటర్లను కాకుండా వారి కుటుంబ సభ్యులను తెనాలిలో వైఎస్ జగన్ పరామర్శించారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా విక్టర్తోపాటు ఇతర నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే ఆయన పరామర్శించారు. అయితే ఈ రౌడీ షీటర్లు.. మూడు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు.
కానీ వారు నేటికి ఇంటికి రాలేదని వారి వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో జైలు నుంచి విడుదలైన వీళ్లు ఎక్కడకు వెళ్లారనే అంశంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. రౌడీషీటర్లను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ముందే అక్కడ నుంచి పంపించేశారా? అనే అంశంపై పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి.
ఇటీవల తెనాలిలోని ఐతానగర్లో యువకులు, పోలీస్ కానిస్టేబుల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల దాడిలో సదరు యువకులకు గాయాలయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే సదరు యువకులు గంజాయి బ్యాచ్ అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గంజాయి బ్యాచ్ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక.. జగన్ పరామర్శకు వెళ్తున్న వారంతా రౌడీషీటర్లని.. ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లు చర్చ సాగుతోంది.
అయితే జగన్ పరామర్శకు వచ్చే వేళ.. వారంతా అక్కడ లేక పోవడంతో.. వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. కానీ జగన్ వస్తున్న వేళ.. సదరు రౌడీ షీటర్లు అక్కడే ఉంటే.. మరిన్ని విమర్శలు రావడమే కాకుండా.. పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ అగ్రనాయకత్వం భావించిన.. ముందస్తు ప్రణాళికల్లో భాగంగా వారిని అక్కడి నుంచి పంపించేశారనే ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..?
గ్లోబల్ డిజిటల్ లీడర్గా భారత్: కేంద్ర మంత్రి పెమ్మసాని
For Andhrapradesh News And Telugu news