MLC Elections: వైసీపీకి కోలుకోలేని దెబ్బ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం..
ABN , Publish Date - Mar 04 , 2025 | 07:19 AM
కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.

గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీ (YCP)కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అధికార కూటమి (Kutami) విజయ ఢంకా మోగిస్తోంది. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో ‘కూటమి’ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమైంది. కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా (Alapathi Raja) అనూహ్య మెజారిటీతో విజయం (Victory) సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా విజయం సాధించారు. దీంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Read More..
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే..
శ్రీనివాసులు నాయుడు విజయం
టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా కౌంటింగ్ ప్రారంభం నుంచి అనూహ్య మెజారిటీతో దూసుకెళ్లారు. రౌండో రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ.. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ‘రికార్డు గెలుపు’ దిశగా సాగారు. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన, బలమైన అభ్యర్థిగా మరోమారు ‘కృష్ణా-గుంటూరు’ బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయం ఎదురవుతోంది. జగన్తో అంటకాగడం, వైసీపీ పరోక్ష మద్దతే ఆయన కొంపముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక... ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ‘కూటమి’ మద్దతు ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ నేత రఘువర్మ రెండోస్థానంలో నిలవగా... వైసీపీ పరోక్ష మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరి మూడోస్థానానికి పరిమితమయ్యారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె విజయం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయన రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. గత నెల 27న జరిగిన పోలింగ్లో 20,794 ఓట్లు పోలవ్వగా.. అందులో 659 చెల్లనవిగా గుర్తించారు. మిగిలిన 20,135 ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అంటే 10,068 ఓట్లు రావాలి. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులు నాయుడికి 7,210, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,845, యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,804 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మిగిలిన ఏడుగురు అభ్యర్థులకు వంద కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. శ్రీనివాసులునాయుడికి 9,237 ఓట్లు, వర్మకు 8,527 ఓట్లు లభించాయి. ఇంకా శ్రీనివాసులునాయుడి ఎన్నికకు 831ఓట్లు అవసరమయ్యాయి. దీంతో రెండో స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాసులునాయుడిని విజేతగా ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News