Share News

Giddaluru: జర్మనీలో గిద్దలూరు విద్యార్థిని మృతి

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:55 AM

జర్మనీలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న గిద్దలూరు విద్యార్థిని రెహనాబేగం ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మృతిచెందింది

Giddaluru: జర్మనీలో గిద్దలూరు విద్యార్థిని మృతి

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లి అనారోగ్యంతో ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్‌ మహబూబ్‌ బాషా కుమార్తె రెహనాబేగం (27) బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసేందుకు 2022లో జర్మనీకి వెళ్లింది. అక్కడి ఆల్‌ పట్టణంలో విద్యను అభ్యసిస్తోంది. సంవత్సరం నుంచి రెహనాబేగం బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపతున్నట్టు ఆమె తండ్రి తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె గత సోమవారం మృతి చెందింది. మృతదేహం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. సోమవారం కంచిపల్లె గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:56 AM