Private Engineering Colleges Fraud: ప్రైవేట్ స్వయంపాలిత ఇంజనీరింగ్ కళాశాలల్లో అక్రమాలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:33 AM
రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూకే అనుబంధంగా ఉన్న స్వయంపాలిత ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆంధ్రపదేశ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అసోసియేషన్...

విచారణ జరిపి చర్యలు తీసుకోండి: ఏపీటీపీఐఈఏ
విజయవాడ (గాంధీనగర్), జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూకే అనుబంధంగా ఉన్న స్వయంపాలిత ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆంధ్రపదేశ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీటీపీఐఈఏ) అధ్యక్షుడు ఎంవీ బ్రహ్మానందరెడ్డి మంత్రి లోకేశ్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. గుంటూరులోని యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (జేఎన్టీయూకే అనుబంధ) ప్రిన్సిపాల్ నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం చేస్తూ విద్యతో పాటు.. పరిపాలనా వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎంటెక్ (సీఎ్సఈ) రెగ్యులర్ కోర్సును నడుపుతున్నారని ఆరోపించారు. అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, జేఎన్టీయూకే అధికారులను కోరారు.