Share News

Konaseema Job Fraud: బయటపడ్డ మాజీ ఎంపీ పీఏల మోసం

ABN , Publish Date - May 21 , 2025 | 12:31 PM

Konaseema Job Fraud: అమలాపురం వైసీపీ మాజీ ఎంపీ చింతా అనురాధ పీఏలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ రాజోలు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ పీఏలు కొమ్ముల చరణ్‌, కుంచే శ్రీకాంత్, మారుబోయిన రాంబాబు నిరుద్యోగులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు.

Konaseema Job Fraud: బయటపడ్డ మాజీ ఎంపీ పీఏల మోసం
Konaseema Job Fraud

అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 21: మోసపోయే వారుంటే మోసం చేసేవారు కూడా కోకొళ్లలుగా పుట్టుకొస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కంత్రీగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉంటారు కొందరు. ఉద్యోగాల (Jobs) కోసం యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగైన ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉంటారు. ఇలాంటి వారినే కొందరు తమ మోసపు మాటలతో బుట్టలో వేసుకుంటుంటారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి చివరకు మొహం చాటేస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.


అమలాపురం వైసీపీ మాజీ ఎంపీ చింతా అనురాధ (Former YSRCP MP from Amalapuram Chinta Anuradha) పీఏలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ రాజోలు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ పీఏలు కొమ్ముల చరణ్‌, కుంచే శ్రీకాంత్, మారుబోయిన రాంబాబు నిరుద్యోగులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు. ఉద్యోగం పేరు చెప్పి కొందరు వ్యక్తుల నుంచి వీరు డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో లక్షల్లో సమర్పించుకున్నారు నిరుద్యోగులు. డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు అయినా వారి నుంచి స్పందన లేదు. ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది.

Weather Updates: దేశవ్యాప్తంగా ఇక వర్షాలే వర్షాలు..దక్షిణ భారతం సహా ముంబై, ఢిల్లీ, బెంగాల్‌లోనూ కుండపోత


చివరకు తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కారు. మాజీ ఎంపీ పీఏలు డబ్బుల వసూలు చేశారని అడబాల క్రాంతి కుమార్ రాజోలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కొమ్ముల చరణ్‌, కుంచే శ్రీకాంత్, మారుబోయిన రాంబాబులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఏల మోసానికి సంబంధించి మాజీ ఎంపీ చింతా అనూరాధకు చెప్పామని.. అయినా కూడా తమకు న్యాయం చేయలేదని బాధితులు ఆరోపించారు. చవ్వాకుల రామ్ నాధ్ , పొలమండ దుర్గాప్రసాద్, మూర్తి ఒక్కొక్కరి నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా

Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 12:35 PM