Open Letter: ముద్రగడ ప్రజలకు బహిరంగ లేఖ
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:24 AM
Mudragada: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తోందంటూ ఆయన తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మనస్పర్దలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

కాకినాడ జిల్లా: కాపు ఉద్యమనేత, వైసీపీ నేత (YCP Leader) ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ప్రజలకు బహిరంగ లేఖ (Open Letter) రాశారు. ఈ మద్య తమ కుటుంబంపై ఒక కుటుంబం దాడి (Family Attack) అంటూ కుమార్తె క్రాంతిపై ఆయన విమర్శలు చేశారు. మనస్పర్దలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమారుడు గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో ఆ కుటుంబం రగలిపోతోందని అన్నారు. తనకు క్యాన్సర్ వచ్చినా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. తాను వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తన చిన్నకొడుకే కారణమని ముద్రగడ పేర్కొన్నారు.
అది ఈ జన్మకు జరగదు..
తన కుమారుడు గిరిబాబును దూరం చేస్తూ ఆ కుటుంబానికి దగ్గరవుతానని, వారి అడుగులకు మడుగులోత్తుతానని అనుకుంటున్నారని.. అది ఈ జన్మకు జరగదని ముద్రగడ అన్నారు. తనకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని స్పష్టం చేశారు. దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్లు.. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోవాలని ముద్రగడ సూచించారు.
తన తండ్రితో మాట్లాడనివ్వడం లేదు..
కాగా తన తండ్రి ముద్రగడ పద్మనాభం ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో నివాసముంటున్న ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు. తాను తన తండ్రిని చూడడానికి కిర్లంపూడి వెళితే తన సోదరుడు గిరి, అతడి మామ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, తన తండ్రితో ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదని పేర్కొన్నారు. ఇది మానవత్వం కాదని గిరిపై క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడతో రాజకీయంగా విభేదించిన క్రాంతి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. తాజాగా ముద్రగడ ఆరోగ్యం గురించి చేసిన ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: వెంకయ్య నాయుడు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హరీష్ రావు
For More AP News and Telugu News