Annavaram Temple: సేవకు రమన్నారు.. అవమానించారు.. అన్నవరంలో ఏఈవో నిర్వాకం
ABN , Publish Date - May 22 , 2025 | 04:29 PM
Annavaram Temple: కాకినాడ అన్నవరం సత్యదేవుడి కొండపై తెలంగాణకు చెందిన మహిళా భక్తులకు తీవ్ర అవమానం జరిగింది. స్వామి వారి సేవకు రావాలని అనుకుని దేవస్థానం అధికారులను సంప్రదించగా.. 20 మంది వరకు అనుమతిస్తామని సమాచారం ఇచ్చారు.

కాకినాడ, మే 22: అన్నవరం సత్యదేవుడి ఆలయంలో (annavaram satyanarayana temple) ఏఈవో కొండలరావు (AEO Kondal Rao) నిర్వాకం వెలుగు చూసింది. తెలంగాణ (Telangana) నుంచి వచ్చిన మహిళా భక్తులను కొండలరావు వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సత్యదేవుడి సేవకు రమ్మని పిలిచారని.. తీరా అక్కడకు వెళ్లాక.. తిరిగి వెళ్లిపోవాలని లేకపోతే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించినట్లు చెబుతున్నారు. కొండపైనే ఉండడానికి వీల్లేదని.. అన్నదానంలో భోజనం కూడా చేయకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాకినాడ అన్నవరం సత్యదేవుడి కొండపై తెలంగాణకు చెందిన మహిళా భక్తులకు తీవ్ర అవమానం జరిగింది. స్వామి వారి సేవకు రావాలని అనుకుని దేవస్థానం అధికారులను సంప్రదించగా.. 20 మంది వరకు అనుమతిస్తామని సమాచారం ఇచ్చారు. అధికారులు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా నుంచి 20 మంది మహిళా భక్తులు అన్నవరం కొండపైకి చేరుకున్నారు. తాము ఇది వరకే ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో స్వామి సేవకు సిద్ధంగా ఉన్నామని మహిళలు చెప్పగా.. దేవస్థానం ఏఈవో కొండలరావు వారిని దుర్భాషలాడారు. తెలంగాణ నుంచి రమ్మని ఎవరు చెప్పారని, ఇక్కడ సేవ చేయడానికి అనుమతి లేదని, ఉన్నపళంగా కొండ నుంచి కిందకు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.
అయితే తాము ఆన్లైన్లో సంప్రదిస్తే సేవకు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని మహిళలందరూ కూడా ఏఈవో కొండలరావును నిలదీశారు. తమకు సంబంధం లేదని, సేవకు ఎలాంటి అనుమతి లేదని వెంటనే కొండ దిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినప్పటికీ మహిళలు అక్కడ ఉండటంతో కొందరు దళారులను పురమాయించి మహిళలు కొండ కిందకు వెళ్లే వరకు వెంటపడేలా చేశారు. సేవ కోసం ఒక్కో మహిళ నుంచి రూ.500 వందల చొప్పున దేవస్థానం అనధికార దోపిడీ బృందం వసూలు చేసింది. ఆన్లైన్లో ఉన్న 9848051211 నెంబర్కు ఫోన్ చేసి తెలంగాణ మహిళా భక్తులు సేవకు వచ్చారు. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత వెళ్లిపోవాలంటూ ఏఈవో హుకుం జారీ చేశారు.
అయితే ఈ విషయాలన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో (ABN - Andhrajyothy) రావడంతో ఏపీ దేవాదాయ శాఖ స్పందించి అన్నవరం ఈవోతో మాట్లాడింది. ఈ ఘటనకు సంబంధం ఉన్న అధికారులను విచారించాలని ఆదేశించింది. దీంతో ఈ ఘటనపై దేవాదాయ శాఖ తరపున విచారణ మొదలైంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సాయంతో తెలంగాణకు చెందిన భక్తులు కొండపై అన్నదానంలో భోజనం చేశారు. అనంతరం ఈవో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అప్పన్న కొండపై అధికారుల తీరుపై మొదటి నుంచి తీవ్ర విమర్శలు ఉన్నాయి. సేవకు వచ్చే మహిళలతో ఏఈవో కొండలరావు గత కొంతకాలంగా అసభ్యరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వీరిని రమ్మని చెప్పి వెంటనే వెళ్లిపొమ్మని చెప్పడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
AP Ration Card: రేషన్కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Read latest AP News And Telugu News