సమాధులను ఆక్రమించడం హేయం
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:36 AM
స్వాతంత్య్ర సమరయోధులు ఎన్జీ రంగా, ఆయన శిష్యుడైన సుందరరావులకు చెందిన ఢిల్లీలోని సమాధులను తవ్వేసి, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం..

ప్రభుత్వం వెంటనే స్పందించాలి: ఎన్జీ రంగా మేనకోడలు ప్రొ.పుష్పకుమారి
గుంటూరు సిటీ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధులు ఎన్జీ రంగా, ఆయన శిష్యుడైన సుందరరావులకు చెందిన ఢిల్లీలోని సమాధులను తవ్వేసి, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం అత్యంత హేయమైన చర్య అని రంగా మేనకోడలు ప్రొఫెసర్ వెలగా పుష్పకుమారి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. మహనీయుల సమాధులను రూపుమాపేందుకు ప్రయత్నాలు జరగడం విచారకరమన్నారు. ఆంధ్ర రాష్ర్టానికి కూడా ఈ చర్య సిగ్గు చేటని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. సమాధుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని భారతీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు కోరారు.