Share News

CPI Ramakrishna: నీటి ప్రాజెక్టులపై అఖిలపక్షం

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:39 AM

గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇదే కొనసాగితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పట్టిన గతే పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ...

CPI Ramakrishna: నీటి ప్రాజెక్టులపై అఖిలపక్షం

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇదే కొనసాగితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పట్టిన గతే పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న, కొత్తగా చేపట్టబోయే ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గోదావరి- బనకచర్ల పేరుతో దాదాపు రూ.82వేల కోట్లు ఖర్చు చేయాలనే ప్రతిపాదనపై హడావిడిగా ముందుకెళ్లడం సరికాదని రామకృష్ణ సూచించారు.

Updated Date - Jun 09 , 2025 | 04:40 AM