Share News

V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:45 AM

విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై విశాఖలో శనివారం నిర్వహించిన సదస్సులో...

 V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

  • ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదు: సీపీఎం శ్రీనివాసరావు

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం), జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై విశాఖలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వనరులను దోచుకునే అభివృద్ధి తమకు వద్దన్నారు. మానవాభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానాల కోసం సీపీఎం పోరాడుతుందన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ, కర్నూలు, విశాఖల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదని, సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు వికేంద్రీకరణ జరగాల్సి ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..


Updated Date - Jan 26 , 2025 | 04:45 AM