CM Chandrababu Naidu: దేనికైనా సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - May 08 , 2025 | 03:29 AM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు

శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నంటున్న భద్రతా చర్యలు, సన్నద్ధతపైన మాక్ డ్రిల్స్ నిర్వహణ, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై చర్చించారు. ఇలాంటి సమయంలో అన్ని శాఖలు అత్యంత సమన్వయంతో పని చేయాలని, ప్రజలు ఆందోళన చెందకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. భారత సాయుధ దళాల ధైర్యసాహసాలకు సెల్యూట్ చెబుతూ తనను తాను రక్షించుకునే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఉక్కు సంక్పలంతో చాటారంటూ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచానికి మన బలాన్ని.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్న కృతనిశ్చయాన్ని చాటి చెప్పామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News