Share News

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

ABN , Publish Date - May 30 , 2025 | 12:39 AM

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస
అమాస రాజశేఖర్‌రెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.ఈయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేది నుంచి 2025 జూన్‌ 26వ తేది వరకు లేదా ఎన్నికలు జరిగేంతవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.డీసీసీబీకి 2006లో జరిగిన ఎన్నికల్లో అమాస రాజశేఖరరెడ్డి చైర్మన్‌గా పోటీచేసి గెలుపొందారు. 2011 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా చైర్మన్‌గా ఎన్నికై మరో ఐదేళ్ల పాటు కొనసాగారు. అప్పటి ప్రభుత్వం సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో 2019 వరకు అమాస రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పాలకవర్గమే కొనసాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఈ పాలకవర్గాన్ని రాజీనామా చేయించారు. దీంతో వడమాలపేట మండలం కాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి (సింగిల్‌విండో) అధ్యక్షుడిగా కొనసాగారు. కాగా ప్రస్తుతం డీసీసీబీ పర్సన్‌ ఇన్‌ఛార్జిగా జేసీ విద్యాధరి కొనసాగుతున్నారు. త్వరలోనే అమాస రాజశేఖర రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Updated Date - May 30 , 2025 | 12:39 AM