DCCB: డీసీసీబీ నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జిగా అమాస
ABN , Publish Date - May 30 , 2025 | 12:39 AM
చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జిగా అమాస రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు.

చిత్తూరు కలెక్టరేట్, మే 29 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జిగా అమాస రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు.ఈయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేది నుంచి 2025 జూన్ 26వ తేది వరకు లేదా ఎన్నికలు జరిగేంతవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.డీసీసీబీకి 2006లో జరిగిన ఎన్నికల్లో అమాస రాజశేఖరరెడ్డి చైర్మన్గా పోటీచేసి గెలుపొందారు. 2011 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా చైర్మన్గా ఎన్నికై మరో ఐదేళ్ల పాటు కొనసాగారు. అప్పటి ప్రభుత్వం సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో 2019 వరకు అమాస రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పాలకవర్గమే కొనసాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఈ పాలకవర్గాన్ని రాజీనామా చేయించారు. దీంతో వడమాలపేట మండలం కాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి (సింగిల్విండో) అధ్యక్షుడిగా కొనసాగారు. కాగా ప్రస్తుతం డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జిగా జేసీ విద్యాధరి కొనసాగుతున్నారు. త్వరలోనే అమాస రాజశేఖర రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు.