Share News

Chirala Municipality: చీరాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌-1 తొలగింపు

ABN , Publish Date - May 30 , 2025 | 05:13 AM

చీరాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ జె. శ్రీనివాసరావు, వైస్‌చైర్‌పర్సన్ జైసన్ బాబును 27 కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంతో తొలగించారు. మున్సిపల్ శాఖ గిద్దలూరు, నరసరావుపేట, యర్రగుంట్ల, ఎమ్మిగనూరు ఘటనలను వివిధ గ్రేడ్‌ల మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన ఉత్తర్వులు జారీ చేసింది.

Chirala Municipality: చీరాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌-1 తొలగింపు

ఇంటర్నెట్ డెస్క్: చీరాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ జె.శ్రీనివాసరావు, వైస్‌చైర్‌పర్సన్‌-1 జైసన్‌ బాబును తొలగిస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14న చీరాల మున్సిపాలిటీలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌-1ను తొలగిస్తూ 27 మంది కౌన్సిలర్లు తీర్మానించారు. ఆ మేరకు కలెక్టర్‌, మున్సిపల్‌ శాఖకు లేఖ రాయడంతో ప్రభుత్వం వారిద్దరిని తొలగిస్తూ ఆదేశాలిచ్చింది.

పలు స్థానిక సంస్థల స్థాయి పెంపు

రాష్ట్రంలో పలు మున్సిపల్‌ స్థానిక సంస్థలను అప్‌గ్రేడ్‌ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గిద్దలూరు నగర పంచాయతీని గ్రేడ్‌-2 మున్సిపాలిటీగాను, నరసరావుపేట మున్సిపాలిటీని గ్రేడ్‌-1 స్థాయి నుంచి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగాను, యర్రగుంట్ల నగర పంచాయతీని గ్రేడ్‌-2 మున్సిపాలిటీగాను, ఎమ్మిగనూరు మున్సిపాలిటీని గ్రేడ్‌-1 నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగాను అప్‌గ్రేడ్‌ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - May 30 , 2025 | 05:16 AM