Newborn Health Focus: నవజాత శిశువులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:27 AM
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ముఖ్యంగా ప్రధాన ఆసుపత్రుల్లోని నవజాత శిశువుల విభాగాలను సందర్శించి సమస్యలను గుర్తించనుంది

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): నవజాత శిశువుల అనారోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లోని నవజాత శిశువుల విభాగాలను సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు పని చేస్తున్న తమ కమిషన్ ఆసుపత్రుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.
Read Latest AP News And Telugu News