Group 1 Starts: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్
ABN , Publish Date - May 02 , 2025 | 05:20 AM
రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో 4,496 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు.

13 పరీక్ష కేంద్రాలు... 4,496 మంది అభ్యర్థులు
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. విశాఖపట్నంలో రెండు, విజయవాడలో ఆరు, తిరుపతిలో మూడు, అనంతపురంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని, 9.45 గంటల వరకు అభ్యర్థులను అనుమతిస్తారని తెలిపింది.