CM Chandrababu: అమరావతిలో అపోలో ఆస్పత్రి
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:43 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు.

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ఆస్పత్రిని నిర్మించాలని అపోలో చైర్మన్ను చంద్రబాబు కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అమరావతిలో ప్రపంచస్థాయి సౌకర్యాలతో అపోలో ఆస్పత్రిని నిర్మిస్తామని చంద్రబాబుకు తెలిపారు.