Share News

CM Chandrababu: అమరావతిలో అపోలో ఆస్పత్రి

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:43 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు.

CM Chandrababu: అమరావతిలో అపోలో ఆస్పత్రి

  • ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ఆస్పత్రిని నిర్మించాలని అపోలో చైర్మన్‌ను చంద్రబాబు కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అమరావతిలో ప్రపంచస్థాయి సౌకర్యాలతో అపోలో ఆస్పత్రిని నిర్మిస్తామని చంద్రబాబుకు తెలిపారు.

Updated Date - Jun 09 , 2025 | 04:44 AM