Vijayawada Tahsildar: తహసీల్దార్ కుటుంబం సేఫ్
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:54 AM
సిక్కిం వరదల కారణంగా చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని సమాచారం. వరద నీరు తగ్గడంతో వారు గాంగ్టక్ నుంచి ప్రయాణం ప్రారంభించారు.

న్యూఢిల్లీ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): సిక్కింలో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఆ రాష్ట్రంలో చిక్కుపోయిన ఏపీకి చెందిన తహసీల్దార్ కుటుంబసభ్యులు సురక్షితంగా ఉన్నారని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు, ఆయన భార్య ఉమ, ఇద్దరు పిల్లలు సిక్కిం రాజధాని గాంగ్టక్కు సోమవారం బయలుదేరారని తెలిపారు.