DSC - 2025: ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు వాయిదా
ABN , Publish Date - Jun 14 , 2025 | 10:17 PM
ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు వచ్చే నెల 1, 2 తేదీలలో నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలు, పరీక్షా తేదీలు, మార్చిన హాల్ టికెట్లను AP MEGA DSC-2025, https://apdsc.apcfas.in websites లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ యోగా డే ను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21న విశాఖలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు. సాగర తీరంలో సుమారు 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టడంతో అధికారులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు. . ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ అందుబాటులో ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
KCR: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
Read latest Telangana News And Telugu News