Share News

AP Journalist Accreditation: జర్నలిస్టుల అక్రిడేషన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

ABN , Publish Date - May 30 , 2025 | 05:18 AM

ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ సమయం లేదా ఆగస్టు 31, ఏది ముందైతే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.

AP Journalist Accreditation: జర్నలిస్టుల అక్రిడేషన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో మూడు నెలలపాటు జూన్‌ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ చేపట్టడం... ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు.

Updated Date - May 30 , 2025 | 05:20 AM