AP Govt: ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపుపై జీవో
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:30 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది. 10వ తేదీ నుండి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు.

అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీ పొడిగింపుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 10వ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.