RALLY: ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:17 PM
కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆదివారం స్థానిక జేఎనటీయూ నుంచి శారదానగర్, కలెక్టరేట్, పూలే సర్కిల్, సప్తగిరి సర్కిల్, సుభాష్రోడ్డు మీదుగా టవర్క్లాక్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు.

అనంతపురం క్లాక్టవర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆదివారం స్థానిక జేఎనటీయూ నుంచి శారదానగర్, కలెక్టరేట్, పూలే సర్కిల్, సప్తగిరి సర్కిల్, సుభాష్రోడ్డు మీదుగా టవర్క్లాక్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల అణచివేతకు ప్రభుత్వం చేస్తున్న పోరుకు క్రీడాకారుల సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కేటింగ్ అసోసియేషన కార్యదర్శి రవిబాల, సీనియర్ కోచ నాగేంద్ర, కోచలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....