Share News

AP News: ఆ పురుగులను ఏరిపారేయాలి : గణపతి సచ్చిదానంద స్వామి

ABN , Publish Date - May 01 , 2025 | 02:04 PM

రాష్ట్రంలో, దేశ సరిహద్దుల్లో పురుగులు ఉన్నాయని, అన్నింటినీ ఏరి వేయాలని దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. మనల్ని రక్షించుకోవాలంటే చీడపురుగులకు పురుగుల మందు కొట్టాల్సిందేనన్నారు. మనదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదం ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. ధర్మం ఆధారంగా చంపడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు.

AP News: ఆ పురుగులను ఏరిపారేయాలి : గణపతి సచ్చిదానంద స్వామి
Sri Ganapati Sachidananda Swamy

అనంతపురం జిల్లా: భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) ఉద్రిక్తతల (Tensions) నేపథ్యంలో దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి (Sri Ganapati Sachidananda Swamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా (Anantapuram District) రాప్తాడు (Raptadu) మండలంలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలన్న దృష్టి కేంద్రానికి ఉన్నట్టు తెలుస్తోందని.... ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తన ఆశీస్సులు అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశ సరిహద్దుల్లో పురుగులు ఉన్నాయని, అన్నింటినీ ఏరి వేయాలని అన్నారు. మనల్ని రక్షించుకోవాలంటే చీడపురుగులకు పురుగుల మందు కొట్టాల్సిందేనన్నారు. మనదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదం ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. ధర్మం ఆధారంగా చంపడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే శక్తి దేశ పౌరులందరికీ కల్పించాలని... శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉగ్రవాదులకు శిక్ష పడుతుందని... ఇవాళ దేశానికి పటిష్టమైన నాయకత్వం ఉందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..


జయలక్ష్మి మాతకు ప్రత్యేక పూజలు..

కాగా రాప్తాడు మండలంలోని బుధవారం బొమ్మేపర్తి గ్రామంలో వెలసిన జయలక్ష్మీ మాత విగ్రహానికి శ్రీ గణపతి సచ్చి దానందస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి బొమ్మేపర్తి ఆశ్రమంలో జయలక్ష్మీ మాత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా గణపతి సచ్చిదానందస్వామి జయలక్ష్మి మాతకు పలు రకాలు పూజలు చేశారు. భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. జయలక్ష్మి పురం గ్రామంలో బుధవారం (ఏప్రిల్ 30వ తేదీ) నుంచి మే 4వ తేదీ వరకు శ్రీ జయలక్ష్మీ మాత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పాల్గొంటారని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల కొత్త షెడ్యూల్ అమలు..

భారీగా తగ్గిన బంగారం ధరలు..

మార్కో రుబియో ఫోన్ కాల్‌పై ఎస్ జయశంకర్ ఎమన్నారంటే..

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 02:17 PM