Share News

CPM: ప్రజల ప్రాణాలు పోతేగాని స్పందించరా..!

ABN , Publish Date - May 20 , 2025 | 12:16 AM

కరెంటు షాక్‌తో ప్రజలు పోతేగాని సంబంధిత అధికారులు స్పందించేలా లేరని సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. మండలంలోని కక్కలపల్లి గ్రామ ప్రజాశక్తి కాలనీలో నెలకొన్న విద్యుత సమస్యను పరిష్క రించాలంటూ సోమవారం సీపీఎం అధ్వర్యంలో స్థానిక సబ్‌స్టేషన కార్యాలయం ఎదుట ధర్నా చేపటా ్టరు.

CPM: ప్రజల ప్రాణాలు పోతేగాని స్పందించరా..!
CPM leaders giving a petition to an employee of the Electricity Department

- ప్రజాశక్తి కాలనీలో విద్యుత సమస్యను పరిష్కరించండి

- సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

అనంతపురం రూరల్‌, మే 19(ఆంధ్రజ్యోతి): కరెంటు షాక్‌తో ప్రజలు పోతేగాని సంబంధిత అధికారులు స్పందించేలా లేరని సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. మండలంలోని కక్కలపల్లి గ్రామ ప్రజాశక్తి కాలనీలో నెలకొన్న విద్యుత సమస్యను పరిష్క రించాలంటూ సోమవారం సీపీఎం అధ్వర్యంలో స్థానిక సబ్‌స్టేషన కార్యాలయం ఎదుట ధర్నా చేపటా ్టరు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ... కొన్నేళ్లుగా ప్రజాశక్తి కాలనీలో విద్యుత సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇళ్లలోని గోడలకు, ఇనుప వస్తువులకు కరెంటు సరఫరా అవుతోందన్నారు. స్థానికంగా ఉన్న ట్రాన్సఫార్మర్‌ సా మర్థ్యానికి మించి కనెక్షన్లు ఉండటం చేత సమస్య తలెత్తుతోందన్నారు. మూడురోజుల కిందట కురిసిన వర్షానికి ఇళ్లలో గోడలకు విద్యుత సరఫరా అయి పిల్లలు, పెద్దలు షాక్‌ కు గుర య్యారన్నారు. ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విద్యుత అధికారులు, సిబ్బందికి కాలనీవాసులు ఫోన చేసినా స్పందించడం లేదన్నారు. వెంటనే ట్రాన్సఫార్మర్‌ను, విద్యుత లైనను మార్చాలన్నారు. ఇదే సందర్భంగా సంబంధిత ఏఈతో మాట్లాడి, ధర్నా విరమించారు. ఈకార్యక్రమంలో నాయకులు వెంకటనారాయణ, ఇర్ఫాన, మసూద్‌, లతీప్‌, రాజు, గఫూర్‌, రామాంజి కాలనీ వాసులు శ్రీనివాసులు, గోపాల్‌, అల్లాప్రకాష్‌, వార్డు సభ్యురాలు ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 20 , 2025 | 12:16 AM