Tanmayi murder: అనంతపురం విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 09:17 PM
ఇంటర్ విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ అనంతపురంలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించి సిఐ పలు వివరాలు వెల్లడించారు. విద్యార్థిని కనపడ్డం లేదని 4వ తేదీన ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్ విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ అనంతపురంలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించి సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ పలు వివరాలు అందించారు. విద్యార్థిని కనపడటం లేదని బుధవారం 4వ తేదీన ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. విద్యార్థిని మంగళవారం (ఈనెల 3న) ఒక యువకుడితో రాత్రి 9 గంటల సమయంలో బైక్ పై వెళ్లినట్లు ఆధారాలు సేకరించామని చెప్పారు.
అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, విద్యార్థినికి ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్లు సమాచారం ఉందని సీఐ చెప్పారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థినిని మంగళవారం రాత్రి కూడేరు లిమిట్స్లోని మణిపాల్ స్కూల్ వెనుక బీర్ బాటిల్తో తల పగలగొట్టి హత్య చేశారని సీఐ వెల్లడించారు. విద్యార్థిని హత్య ఒకరే చేశారా లేక ఎంతమంది ఉన్నారన్నది విచారణ పూర్తి అయిన తరువాత తెలుస్తుందని సీఐ చెప్పారు.
ఇవీ చదవండి:
ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..