Share News

Complaint on Avinash Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డిపై ఫిర్యాదు.. పోలీసులతో కొట్టించారంటూ ఆవేదన..

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:31 PM

పులివెందుల సింహాద్రిపల్లికి చెందిన శ్వేతతో 2016లో తనకు వివాహం అయ్యిందని శేషానందరెడ్డి తెలిపాడు. అయితే ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో 2019లో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పాడు.

Complaint on Avinash Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డిపై ఫిర్యాదు.. పోలీసులతో కొట్టించారంటూ ఆవేదన..
MP YS Avinash Reddy

అనంతపురం: కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy)పై అనంతపురం ఎస్పీ జగదీశ్‌ (SP Jagadeesh)కు ఫిర్యాదు అందింది. అవినాశ్ రెడ్డి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆకుతోటపల్లి శేషానందరెడ్డి (Sheshananda Reddy) అనే వ్యక్తి ఎస్పీని ఆశ్రయించాడు. తన కుటుంబ వ్యవహారాల్లో ఎంపీ జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కాపురానికి రానీయకుండా కుటుంబంలో చిచ్చుపెట్టారంటూ ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.


పులివెందుల సింహాద్రిపల్లికి చెందిన శ్వేతతో 2016లో తనకు వివాహం అయ్యిందని శేషానందరెడ్డి తెలిపాడు. అయితే ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో 2019లో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన భార్య సోదరితో అవినాశ్ రెడ్డి తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని ఎస్పీ ఎదుట తన బాధను వెళ్లగక్కాడు. అవినాశ్ రెడ్డి మాటలు విని అప్పటి పులివెందుల సీఐ బాలమద్దిలేటితో తనను కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందులో అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని చెప్పుకొచ్చాడు బాధితుడు. వారిద్దరిపైనా కేసులు నమోదు చేసి న్యాయం చేయాలంటూ ఎస్పీ జగదీశ్‍కు మెురపెట్టుకున్నాడు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పుకొచ్చాడు. తండ్రికొడుకుల బారి నుంచి ఎలాగైనా రక్షించి మానసిక క్షోభ నుంచి బయటపడేయాలని ఎస్పీని కోరాడు. శేషానందరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ జగదీశ్ న్యాయం చేస్తానంటూ హమీ ఇచ్చారు.


అయితే భార్యాభర్తల వ్యవహారంలో తలదూర్చి వారిని దూరం చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డిపై స్థానికులు మండిపడుతున్నారు. ఎంపీగా ప్రజలకు సుపరిపాలన అందించకుండా కుటుంబాల్లో చిచ్చుపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాల్సింది పోయి పోలీసులను పురమాయించి కొట్టించడం ఏంటని ఆగ్రహిస్తున్నారు. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి నేతలు.. ప్రజలకు ఏ విధమైన పాలన అందిస్తారో అర్థం అవుతోందంటూ చర్చించుకుంటున్నారు. గొడలిపోటుకు అలవాటుపడిన వారికి కుటుంబాల్లో చిచ్చుపెట్టడం పెద్ద విషయమేమీ కాదంటూ చెవులు కొరుక్కుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Deveineni Uma Maheswara Rao: టీడీపీ ఆ విషయం మరోసారి రుజువు చేసింది: దేవినేని ఉమా..

Vamsi Case: వల్లభనేని వంశీ కోరికను అంగీకరించిన జైలు అధికారులు

Updated Date - Mar 10 , 2025 | 04:35 PM