Minister Narayana: టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి
ABN , Publish Date - May 03 , 2025 | 05:00 AM
పదేళ్ల తర్వాత మళ్లీ మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమవుతుండటం ప్రజల్లో ఆశాజ్యోతి రగిలించింది. ప్రపంచ టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది

పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధాని మోదీ చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్లీ తిరిగి పదేళ్ల తర్వాత రాజధాని పనులు పునఃప్రారంభం కూడా మోదీ చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం రైతులు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగం వెలకట్టలేనిది. ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వం నిర్వాకంతో రాజధాని పనులు ఐదేళ్ల పాటు నిలిచిపోయాయి. ప్రధాని మోదీ ఆశీస్సులతో చంద్రబాబు సారథ్యంలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం.
- పురపాలక శాఖ మంత్రి నారాయణ
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్