Share News

AP State Event: విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు

ABN , Publish Date - Jun 13 , 2025 | 03:39 AM

అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం గురువారం రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించ తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రద్దయింది.

AP State Event: విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు

  • సీఎం నేటి విశాఖ పర్యటన కూడా..

అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం గురువారం రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించ తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం రద్దయింది. మొదట దీనిని శుక్రవారానికి వాయిదావేశారు. అయితే పూర్తిగా రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం నాటి తన విశాఖపట్నం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. అక్కడ ఆయన న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ రీజనల్‌ వర్క్‌షాపులో పాల్గొనాల్సి ఉంది.

Updated Date - Jun 13 , 2025 | 03:42 AM