'Ra..Kadalira': శ్రీకాకుళంలో చంద్రబాబు ‘రా..కదలిరా’ సభ..
ABN, Publish Date - Feb 27 , 2024 | 12:36 PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకాకుళంలో ‘రా..కదలిరా’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగం రావాలన్నా.. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడిందన్నారు. మీ ఓటుతో కలియుగ భస్మాసురుడు.. జగన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు.

శ్రీకాకుళంలో జరిగిన ‘రా..కదలిరా’ సభకు విచ్చేసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం.

శ్రీకాకుళం ఎనభై అడుగుల (80 Feet) రోడ్డులో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ అరాచక పాలన, అవినీతిని ప్రజలకు వివరిస్తున్న దృశ్యం..

ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం-జనసేన కూటమిగా ఏర్పడిందని, ఓట్లువేసి గెలిపించాలని పేర్కొంటూ.. టీడీపీ, జనసేన జెండాలను పట్టుకుని ప్రజలకు చూపుతున్న చంద్రబాబు నాయుడు.

శ్రీకాకుళంలో జరిగిన ‘రా..కదలిరా’ సభ వేదికపై ప్రజలకు అభివాదం తెలుపుతున్న చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ తదితరులను చిత్రంలో చూడవచ్చు.

శ్రీకాకుళం ‘రా..కదలిరా’ సభకు విచ్చేసిన చంద్రబాబుకు జిల్లా టీడీపీ నేతలు గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం. ఈ సందర్భంగా విక్టరీ సంకేతం చూపుతున్న చంద్రబాబు..

శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘రా..కదలిరా’ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. బాబు ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకిస్తున్న జనం..
Updated at - Mar 01 , 2024 | 07:43 AM