దావూద్ బెదిరింపులతోనే భారత్ను వీడా!
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:12 AM
గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం బెదిరింపులు కారణంగానే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ చెప్పారు.

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం బెదిరింపులు కారణంగానే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ చెప్పారు. ఐపీఎల్ పోటీల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయించాలని దావూద్ తనపై ఒత్తిడి తెచ్చాడని, అందుకు నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చివరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరించాడని చెప్పారు. తనకు హెచ్చరికలు వచ్చిన విషయం పోలీసులకు కూడా తెలుసన్నారు. హిట్లిస్టులో ఉన్నావని, 12 గంటల పాటే రక్షణ ఇవ్వగలమని పోలీసులు చెప్పడంతో వెంటనే ముంబైని వీడాల్సి వచ్చిందని తెలిపారు. తాను అవినీతికి పాల్పడినట్టు ఏ కోర్టులోనూ రుజువు కాలేదన్నారు.